Namaste NRI

రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల  చేయూత

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమవంతుగా సహాయం అందిస్తున్నారు. అగ్ర హీరో బాలకృష్ణ వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఏపీకి 50 లక్షల చొప్పున కోటి రూపాయలను అందజేయనున్నట్లు మహేష్‌బాబు  తెలిపారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం రెండు రాష్ర్టాలకు చెరో 50 లక్షలు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ కలిసి రెండు రాష్ర్టాలకు 25 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ, ఏపీకి 15 లక్షల చొప్పున మొత్తం 30లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

రెండు రాష్ర్టాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఐదు లక్షల చొప్పున మొత్తం పది లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు హీరో విశ్వక్‌సేన్‌ పేర్కొన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి సైతం రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 5 లక్షలు విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. కథానాయిక అనన్య నాగళ్ల రెండు రాష్ర్టాలకు కలిపి ఐదు లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events