
సిధిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఆఫ్ ఛేంజ్. బెర్ల్ సింగర్, సిద్ధార్థ్ రాజశేఖర్, సురేంద్రన్ జయశేఖర్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ నెల 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్ను విడుదల చేశారు. 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంలో నడిచే కథ ఇది. కొందరు చారిత్రక వ్యక్తుల నిజ జీవితాలతో రూపొందించాం. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుంది. ఇలాంటి కథ ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకూ రాలేదు అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీరాజ్ సాజి, నిర్మాతలు: సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా, దర్శకత్వం: సిధిన్.
