చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. శ్రుతిహాసన్ కథానాయిక. రవితేజ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. బాబీ కొల్లి ( కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ప్రత్యేక గీతం లిరికల్ వీడియోని విడుదల చేశారు. బాస్ వచ్చిండు.. కిక్ ఇచ్చిండు అంటూ సాగే బాస్ పార్టీ పాటతో హంగామా షురూ అయ్యింది. చిరంజీవి, ఊర్వశి రౌతేలాపై తెరకెక్కించిన ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచగా, ఆయనతో కలిసి నకాస్ అజీజ్, హరిప్రియ ఆలపించారు. శేఖర్ నృత్య రీతులు సమకూర్చారు. మాస్ యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రంలో చిరంజీవి మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్ధర్ ఎ.విల్సన్. ప్రొడక్షన్ డిజైనర్: ఎ.ఎస్. ప్రకాష్, స్క్రీన్ప్లే: కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి.
