ఎన్టీఆర్ దేవర చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ శక్తివంతమైన నటన అందరిని మెప్పించింది. సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, దీనికి సీక్వెల్గా దేవర-2 ను తెరకెక్కించబోతున్నట్లు నిర్మాణ ఓ ప్రకటన విడుదల చేసింది. దేవర తుఫాను సముద్రతీరాల్ని తాకి విధ్వంసాన్ని సృష్టించి నేటితో ఏడాది పూర్తయింది.

దేవర పేరు అందరికీ గుర్తుండిపోయింది. ప్రేమతో కావొచ్చు లేదా భయంతోనైనా కావొచ్చు, దేవర పేరుని మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మనమంతా దేవర-2 కోసం సిద్ధమవుదాం అంటూ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పేర్కొంది. తొలిభాగం కంటే దేవర-2 తీవ్రమైన భావోద్వేగాలు, యాక్షన్ ఘట్టాలతో సీక్వెల్ను రూపొందించబోతున్నా మని దర్శకుడు కొరటాల శివ గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు దేవర-2 మీద భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.
















