అమెరికాలోని న్యూజెర్సీలో హిందువులు అత్యంత పవిత్రంగా ఆచరించే వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. న్యూజెర్సీలోని సాయిదత్తపీఠం శ్రీశివ విష్ణు దేవాలయం వేడుకలకు వేదికైంది. స్థానిక ఎన్నారై భక్తులు హరి నామాన్ని స్మరించుకుంటూ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకర మంచి భక్తులకు వివరించారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని ఆయన తెలిపారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/12/261123brk-newjersey1c.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/12/261123brk-newjersey1b.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/12/vaikunta-ekadasi05.jpg)