Namaste NRI

యూట్యూబ్‌లో వేట… ఆ జంటకు రూ.కోటి జరిమానా

జంతువులను వేటాడుతూ హతమార్చిన వీడియోలను ఓ జంట యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నది. వీరి వీడియోలను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తమ వేటకు వందలాది జంతువులు బలైనట్లు చూపేలా ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆ జంటకు కష్టాలను తెచ్చిపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ కోర్టు ఒకటి వీరికి రూ.కోటికి పైగా జరిమానా విధించింది. యునైటెడ్ స్టేట్స్కు చెందిన జోష్, సారా బౌమరి జంతువులను వేటాడుతూ ఆ వేట వీడియోలను యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలను పెద్ద సంఖ్యలో చూసేందుకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అయితే, వీరి తంతు జంతువుల వేట నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నదంటూ  నెబ్రాస్కాలోని ఓ కోర్టులో పిటిషన్ నమోదైంది. దీనిపై విచారించిన నెబ్రాస్కా కోర్టు ఆ జంటకు 1,33,000 అమెరికన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1.08 కోట్లు) జరిమానా విధించింది. ఈ జంటపై సుదీర్ఘ విచారణ 39 నేరారోపణలకు దారితీసింది. జోష్, సారా బౌమరిలు అనేక చట్టవిరుద్ధమైన గేమ్ హంటింగ్ విహారయాత్రలను చేపట్టారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events