Namaste NRI

మా అమ్మ కోసమే ఈ చిత్రం చేశాను : సాయిధరమ్‌ తేజ్‌

 సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మిస్టీక్‌ థ్రిల్లర్‌ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్‌ని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లోని బిగ్‌స్క్రీన్‌పై ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.  యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో   ప్రారంభమైన ఈ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. బాపినీడు. బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ  మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను. ఈ చిత్రానికి సుకుమార్‌ స్కీన్‌ప్లే అందించడం, నిర్మాణ భాగస్వామిగా ఉండటం ఎంతో సంతోషంగా వుంది అని అన్నారు.  దర్శకుడు కార్తీక్‌ దండు మాట్లాడుతూ ఓ అడవిలో ఉన్న పల్లెటూరిలో జరిగే కథ ఇది. 1990 నేపథ్యంలో సాగుతుంటుంది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు.   ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 21న విడుదల కానుంది.  ఈ కార్యక్రమంలో కెమెరామెన్‌ శ్యామ్‌ దత్‌, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు : సతీష్‌ బీకేఆర్‌, అశోక్‌ బండ్రెడ్డి,  సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌, నటీనటులు, శ్యామల, సోనియా, కమలాకర్‌, రవి  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events