ఐసీఐసీఐ బ్యాంకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ ఖాతాలపై విధించే సర్వీసు చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నారై రెగ్యులర్ అకౌంట్, ఎన్నారై ప్రో అకౌంట్, ఎన్నారై స్టూడెంట్ అకౌంట్, ఎన్నారై లో బ్యాలెన్స్ అకౌంట్, స్పర్శ్ అకౌంట్లలో బ్యాంకు నిబంధనల ప్రకారం కనీస నిల్వలు పాటించని పక్షంలో ఈ ఛార్జీలు విధిస్తామని బ్యాంకు ప్రకటించింది. మునుపటి స్థాయితో పోలిస్తే చార్జీలను బ్యాంకు ఒక శాతం మేర పెంచింది.