Namaste NRI

ఐసీఐసీఐ బ్యాంక్ కీలక ప్రకటన… ఎన్నారైలకు షాక్‌

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎన్నారై సేవింగ్స్ అకౌంట్స్‌కు  సంబంధించి సర్వీస్ చార్జీలు  పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 1 నుంచి సవరించిన చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా, చెక్కు ద్వారా జరిగే లావాదేవీలకు సంబంధించిన పెనాల్టీను కూడా పెంచుతున్నట్టు చెప్పింది. క్యాష్ డిపాజిట్లు, బ్యాంక్ సేట్‌మెంట్, పాస్‌బుక్ సంబంధించి డూప్లికేట్ సర్టిఫికేట్‌ల జారీ, తదితర సేవలన్నిటికీ చార్జీలు పెంచుతున్నట్టు పేర్కొంది.

Social Share Spread Message

Latest News