Namaste NRI

మంచి కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు : చైతన్యరావు

ధన్య బాలకృష్ణ, చైతన్యరావు, తేజ ఐనంపూడి  ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం జగమే మాయ. సునీల్‌ పుప్పాల దర్శకత్వం వహించారు.  ఉదయ్‌ కోలా,  శేఖర్‌ అన్నే నిర్మాతలు. ఈ సినిమా విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యరావు మాట్లాడుతూ  బలమైన కథ ఉంటే  ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోమారు రుజువు చేసింది చిత్రం. ప్రేక్షకుల నుంచి ఇలాంటి సహకారం అందితే మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయన్నారు.  అనంతరం  నిర్మాత  ఉదయ్‌ కోలా మాట్లాడుతూ కథదే ఈ విజయం. దర్శకుడు సునీల్‌ మంచి స్క్రిప్ట్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అన్ని భాషల నుంచీ మంచి స్పందన లభిస్తోంది అన్నారు.  సునీల్‌ పుప్పాల మాట్లాడుతూ  ఉదయ్‌గారు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో  సునీల్‌ ఉప్పాల, తేజ ఐనంపూడి తదితరులు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events