Namaste NRI

రాజా కసుకుర్తి సహకారంతో తానా వారు వికలాంగులకు శీతాకాల దుప్పట్లు పంపిణీ

తానా ఆధ్వర్యలో కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ ఆశాజ్యోతి ఆశ్రమంకి చెందిన అనాధులు, దివ్యాంగుల పిల్లలకు దుప్పట్లు, రగ్గులు పంపణీ చేశారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధిగా వీరవల్లీ సర్పంచ్ పిల్లా అనిత, స్తానిక ప్రముఖులు అవిర్నేని శేషగిరి, కలపాల రాజాబాబు, పిల్లా రామారావు, యలమంచిలి మూర్తి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా కమ్యునిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సహకారంతొ వారి సూచనల మేరకు దివ్యాంగులు పిల్లలకు పంపిణీ చేశారు. క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా  మొక్కలు నాటే కార్యక్రమాలు పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నారని వారి సేవల మన అందరికి స్ఫూర్తిదాయకమని సర్పంచ్ పిల్లా అనిత అన్నారు. శీతాకాలంలొ ఉపయొగపడె దుప్పట్లు ఇచ్చినందుకు వికలాంగులుమరియు వసతి గ్రుహ నిర్వాహకులు తానా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News