కొవిడ్ 19 మహమ్మారిపై స్పందన విషయంలో భారత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈవో మార్క్ సజ్మన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి పథంలో ముందడుగు వేసే విషయంలో ఒక ఉదాహరణగానూ ఉందని తెలిపారు. భారత్లో రూపొందిన అభివృద్ధి నమూనాలు, ప్రపంచ పురోగతిని వేగవంతం చేయగలవని వివరించారు. 200 కోట్లకు పైగా టీకా డోసులను వేయడం, 90 శాతం వ్యాక్సినేషన్ రేటును సాధించడం ద్వారా కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు అవసరమో ప్రపంచానికి భారత్ చాటిందని తెలిపారు. కొవిడ్ టీకాల ఉత్పత్తిలో మన దేశ సామర్థ్యాన్ని వ్యాక్సినేషన్ పోర్టల్ కొవిన్ను ఆయన ప్రశంసించారు.














