కువైత్లోని భారత రాయబార కార్యాలయం రిపబ్లిక్ డే వేడుకలపై కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని వర్చువల్గా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కోవిడ్`19 ప్రొటోకాల్, నిబంధనలను అనుసరిస్తూ 2022 జనవరి 26న వర్చువల్ విధానంలో రిపబ్లిక్ డే నిర్వహిస్తామని రాయబారి సీబీ జార్జ్ వెల్లడిరచారు. జనవరి 26 నాడు భారత ప్రవాసులు ఎవరూ ఎంబసీ వద్దకు రావొద్దని తెలిపారు. ఆ రోజు రాయబారి భారత జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సందేశాన్ని చదివి వినిపిస్తారని ఈ సందర్భంగా ఎంబసీ పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)