
పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కు అన్ని రకాల పోస్టల్, పార్శిల్ సేవలను నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై భూ, వాయుమార్గాల్లో ఆ దేశానికి పోస్టల్, పార్శిల్ సేవలు సాధ్యం కావని సంబంధిత వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ ఒక్కో నిర్ణయం తీసుకుంటూ వస్తున్నది. ఈ క్రమంలోనే పోస్టల్, పార్శిల్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడింది.
