Namaste NRI

ఇండోనేషియా కీలక నిర్ణయం.. విదేశీ పర్యాటకులకు

ఆర్థికంగా బలపడేందుకు ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. సంపన్న విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. బాలీ  పర్యాటక ప్రాంతం ద్వారా విదేశీ సంపన్న పర్యాటకులను ఆకర్షించేందుకు  సెకండ్ హోమ్ వీసా ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 5, 10ఏళ్ల గడువుతో కూడిన టూరిస్ట్ వీసాలను జారీ చేయనున్నట్టు ఇండోనేషియా తాజాగా ప్రకటించింది. ఈ వీసాలు పొందిన టూరిస్ట్‌లు గరిష్టంగా 10ఏళ్ల పాటు తమ దేశంలో ఉండొచ్చని వివరించింది. పెట్టుబడితోపాటు ఇతర కార్యకలాపాలు కూడా సాగించొచ్చని వెల్లడించింది. అయితే ఈ వీసాలు పొందాలనుకునే టూరిస్ట్‌లు తమ బ్యాంకు అకౌంట్లో 1,30,000 డాలర్లను కలిగి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  ఈ ప్రోగ్రామ్ క్రిస్మస్ రోజు నుంచి అమలులోకి వస్తుందని ఇండోనేషియా వెల్లడించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events