Namaste NRI

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం  ప్రీ రిలీజ్‌ వేడుక

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.  ఏ.ఆర్‌. మోహన్‌ దర్శకుడు. రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదల కానుంది.  ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ మాట్లాడుతూ  ఇది సీరియస్‌ సినిమా అని చాలా మంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఇందులో నలభైశాతం కామెడీ ఉంటుంది. మిగతా కథ ఎమోషనల్‌గా సాగుతుంది అన్నారు. ఈ సినిమాలో నేను టీచర్‌గా కనిపిస్తా. చక్కటి సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుంది అని చెప్పారు.  దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా 17 ఏళ్ల కల. ప్రజల జీవితాన్ని తెరపై చూపాలనే కోరికతో ఈ కథ రాసుకున్నా. తప్పకుండా అందరిని మెప్పిస్తుంది  అని తెలిపారు.  ఈ సినిమా విజయవంతం చేసి నిర్మాతగా తన మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని నిర్మాత రాజేష్‌ దండా కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి, అబ్బూరి రవి, వి.ఐ. ఆనంద్‌, విజయ్‌ కనకమేడల, వశిష్ట, తిరుమల కిశోర్‌, అభిషేక్‌ అగర్వాల్‌, నాంది సతీష్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events