Namaste NRI

ఇజ్రాయెల్‌ను సందర్శించిన ఇవాంక ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక, ఇజ్రాయెల్‌ను సందర్శించారు. భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి బందీల కుటుంబాలను పరామర్శించారు. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి అనాగరిక చర్య అని విమర్శించారు. హమాస్ కిడ్నాప్‌ చేసిన కుటుంబాలతోపాటు గాజాలో ఇంకా బందీలుగా ఉన్న బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించినట్లు చెప్పారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న పలువురు రాజకీయ నేతలను కూడా తాము కలిసినట్లు వెల్లడించారు.

కాగా, అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మరణించగా వందలాది మందిని బందీలుగా గాజాకు పట్టుకెళ్లారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ఆర్మీ బాంబు దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు 20,000 మందికిపైగా మరణించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events