Namaste NRI

9/11 మృతులకు జో బైడెన్‌ నివాళి

న్యూయార్క్‌లోని ట్విటన్‌ టవర్స్‌ పై 21 ఏళ్ల క్రితం సెప్టెంబరు 11వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పౌరులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాళులర్పించారు. పెంటగాన్‌ మెమోరియల్‌ నుంచి బైడెన్‌ జాతినుద్ధేశించి ప్రసంగించారు. మన గుండెలు బద్దలైన ఆ దుర్దినాలు మనకు ఇప్పటికే గుర్తే ఉన్నాయి. ఆ ఘోరకలిని దిగమింగుకుని అందరం కలిసి మెలిసి ముందడుగు వేశాం. ఇప్పుడూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని పేర్కొన్నారు. ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చేసిన ఆ దాడిలో 3000 మంది పౌరులు మరణించారు.

Social Share Spread Message

Latest News