Namaste NRI

నూతన సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న డీవై చంద్రచూడ్‌ నవంబర్‌ 10న పదవీ విరమణ చేస్తారు. దీంతో నవంబర్‌ 11న సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. సంజీవ్‌ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతమున్న సీజేఐ చంద్రచూడ్‌ 2022 నవంబర్‌ 8 నుంచి ఈ పదవిలో ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events