కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఉప్పు కప్పురంబు. ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సెటైరికల్ కామెడీ డ్రామాను రాధికా ఎల్ నిర్మించారు. యువ నటుడు సుహాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే, నాన్న చనిపోవడంతో గ్రామ పెద్దగా అధికారం చేపడుతుంది అమాయకురాలైన కీర్తి సురేష్. ఈ క్రమంలోనే ఆ గ్రామానికి ఒక వింత సంక్షోభం వస్తుంది. ఊరిలో ఉన్న స్మశానంలో జనాలు చనిపోయి హౌజ్ఫుల్గా మారుతుంది. దీంతో ఇంకా నలుగురు చనిపోయి పూడ్చి పెట్టేంతా స్థలం మాత్రమే మిగిలి ఉంటుంది. అయితే ఈ సమస్యను గ్రామస్థులు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఈ సినిమా కథ. వసంత్ మురళీకృష్ణ మళింగంటి ఈ సినిమాకు కథను అందించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటైన కార్యక్రమంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ ఈ ఉప్పు కప్పురంబు కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో అపూర్వ అనేది ఒక భిన్నమైన పాత్ర నాది అని అన్నారు. సుహాస్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నేను చేసిన చిన్నా పాత్ర ఇదివరకు చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 4 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది.
