విశ్వాంతరాళంలో ఎక్కడో ఒక చోట గ్రహాంతర వాసులు (ఎలియన్స్) ఉండొచ్చని, ఒకవేళ ఏలియన్స్ భూమీ మీదకు వస్తే మనుషులకు ప్రమాదమేనని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషుల కంటే ఏలియన్స్ దగ్గర గొప్ప సాంకేతికత ఉండొచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. స్పేస్షిప్ల సాయంతో వాళ్లు ఒక నక్షత్ర మండలం నుంచి మరో నక్షత్ర మండలానికి సులభంగా వెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చన్నారు. ఇదే జరిగితే, మనుషులు చిక్కుల్లో పడ్డట్లేనని, ఏలియన్స్ దయతోనే మనం బతుకీడాచ్చాల్సిందేనన్నాఉ. అయితే ఏలియన్స్ ఉనికిపై తనకు ఇంతవరకూతే సమాచారం లేదన్నారు.














