నితిన్ కథానాయకుడిగా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా కథానాయికలు. ఇందులో కృతిశెట్టి స్వాతి అనే యువతి పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్రి పరిచయం చేస్తూ లుక్ని విడుదల చేసింది చిత్ర బృందం. రాజకీయం నేపథ్యంలో ఓ మాస్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమాని మలిచారు. సిద్దార్థ్ రెడ్డి అనే యువ ఐఏఎస్ అధికారిగా నితిన్ నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తది దశలో ఉన్నాయి. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులు. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల.














