Namaste NRI

నవంబర్‌ 1లోగా దేశం విడిచి వెళ్లిపోండి…. లేనిపక్షంలో వారిని

అక్రమ వలసదారులకు  పాకిస్థాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. నవంబర్‌ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని అల్టిమేటమ్‌ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే అక్రమ వలసదారులకు షెల్టర్‌ ఇచ్చిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొంది. ఆ దేశ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. పాకిస్థాన్‌లోని వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయులతో సహా అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులంతా నవంబర్ 1 గడువు కంటే ముందే స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. నవంబరు 1 తర్వాత పత్రాలు లేని వలసదారులందరినీ తొలగించే ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పాకిస్థాన్ కృతనిశ్చయంతో ఉందని మీడియాతో అన్నారు. అక్రమ వలసదారులను గుర్తించామని, వారి సమాచారం తమ వద్ద ఉందని వెల్లడించారు. స్వచ్ఛందంగా వెళ్లే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events