Namaste NRI

ఖైరతాబాద్‌లో కొలువు దీరిన మహా గణపతి

ఖైరతాబాద్ భారీ గణపతి దేవుడు  కొలువుదీరాడు. ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య  ఈ ఏడాది ప్రత్యేకంగా మట్టితో 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. మహాగణపతి తొలి పూజకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎమ్మెల్యే, గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఉపాధ్యక్షుడు నాగేష్‌ హాజరయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events