Namaste NRI

ఈ నెల 17న ఎన్నారై ప్రతినిధులతో సమావేశం : మహేశ్ బిగాల

ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎన్నారైల శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖల కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్‌ అభ్యర్థిత్వానికి ఎన్నారైల తరపున మద్దతు ఇస్తామన్నారు. ఈ నెల 17 భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 9 గంటలకు ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియా కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు, హుజురాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరు కానున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి పనులు చెబుతూ ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఎన్నారైల తరపున ప్రచారాన్ని చేస్తున్నామని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events