నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం థ్యాంక్ యూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రాశిఖన్నా, మాళవిక నాయక్, అవికాగోర్ కథానాయికలు. విభిన్న ప్రేమకథగా చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా విడుదల తేదీ ఖారారైంది. ఈ నాగచైతన్య ఇందులో పలు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.














