Namaste NRI

మిస్ ఇండియా గా రాజస్థాన్ భామ నందినీ గుప్తా

ప్రతిష్టాత్మక 59వ ఎడిషన్‌ ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన 19ఏళ్ల భామ నందినీ గుప్తా గెలిచి ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి, నందినీ గుప్తాకు కిరీటాన్ని తొడిగారు. ఈ పోటీలకు 29 రాష్ట్రాలకు చెందిన భామలు పోటీ పడ్డారు.  ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్‌లు రన్నరప్‌గా నిలిచారు.

 స్టేజీపై ఆట, పాటలతో హొరెత్తించారు.  కార్తిక్‌ ఆర్యన్‌, అనన్య పాండేల నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహన్‌, ఆంధ్రపదేశ్‌ నుంచి గోమతి ఈ పోటీల్లో పాల్గొన్నారు. గతేడాది విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్, షినతా చౌహాన్, మానస వారణాసి, మాణికా షియోకంద్, మాన్య సింగ్, సుమన్ రావ్ మరియు శివాని జాదవ్ మోహే లెహంగాలు ధరించి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ వేడుకలకు సినీ తారలతో పాటు పలు రంగానికి చెందిన ప్రముఖులు తరలి వచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events