ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటనలో భాగంగా భౌతిక శాస్త్రంలో పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఈ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెర్రెన్స్క్రౌజ్, స్వీడన్కు చెందిన అన్నె ఎల్హ్యూలియర్కు ఈ ఏడాది నోబెల్ను ప్రకటించారు.అణువుల్లో ఎలక్ట్రానిక్ డైనమిక్స్ను అధ్యయనం చేసినందుకు, కాంతి తరంగాల లటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.














