విజయ్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం వారసుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై నిర్మిస్తున్న చిత్రం. పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న తెలుగులో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ నా జీవితంలో కుటుంబానికి చాలా ప్రాధాన్యత వుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకు తోడుగా వుండేది మన కుటుంబమే. ప్రతి కుటుంబంలో లోపాలు వుంటాయి. కానీ ఉన్నది ఒక కుటుంబం. ఈ ఆలోచనతోనే వారసుడు కథ పై వర్క్ చేశాం. విజయ్కు కథ చెబితే ఒకే ఒక సిట్టింగ్లో ఓకే అయిపోయింది. అయితే విజయ్తో ఈ సినిమా చేస్తున్నామన్న తర్వాత టెన్షన్ మొదలైయింది. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ఆయనకు సరిపడే విధంగా ఈ సినిమా చేయడం కోసం మంచి టీంను సెట్ చేశాం.తమిళ్లో వారిసు సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమాని ప్రేమించడానికి ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి ఉండాల్సిన ప్రత్యేకత ఈ సినిమాకి వుంది. శరత్కుమార్, జయసుధ నటన గురించి అద్భుతంగా రాస్తున్నారు. అమ్మ నిజం, నాన్న నమ్మకం అదే ఈ సినిమాలో చూస్తారు అని అన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ చెన్నైలో ఈ నెల 10న మీడియా వారికి ఈ సినిమా షో వేశాం. వారు బాగుందని ప్రశంసిస్తూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అని అన్నారు . ఈ సినిమా పాయింట్ చెప్పినప్పుడే బాగా నచ్చింది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. ఈ రోజు మీ దిల్రాజు, వంశీ తమిళంలోకి వెళ్లి ఓ బ్లాక్బస్టర్ హిట్ కొట్టి ఇక్కడకొచ్చాం. ఇది సాధారణ విషయం కాదు. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. సక్సెస్ అంటే డబ్బే కాదు. దానితో వచ్చే ఎమోషన్ ముఖ్యం. తమిళంలో ఆల్రెడీ విజయం సాధించిన సినిమాతో మీ ముందుకొస్తున్నాం. ఇక్కడ కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నా అన్నారు. ఈ సమావేశంలో తమన్, శరత్ కుమార్, శ్రీకాంత్, శ్యామ్, హరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.