Namaste NRI

టీడీపీ విజయానికి ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాలి : కోమటి జయరాం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు కీలక పాత్ర పోషించాలని, టీడీపీ విజయానికి కృషి చేయాలని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎస్‌ఏ కో ఆర్డినేటర్‌ కోమటి జయరాం అన్నారు.  ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని అన్నారు. తెలుగుజాతి కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటిన వ్యకి ఎన్టీఆర్‌ అని కొనియాడారు.  ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు సంవత్సరమంతా నిర్వహించాలని పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు.  ప్రతి నెలా క్రమం తప్పకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎస్‌ఏ సభ్యులను ఆయన అభినందించారు.  టీడీపీని స్థాపించిన బడుగు, బలహీన వర్గాలకు అందులో భాగస్వామ్యం కల్పించిన అభ్యుదయవాదిగా ఎన్టీఆర్‌ నిలిచారని కొనియాడారు. టీడీపీ ద్వారా ప్రజలు ఎన్నో సేవలు అందిచారని గుర్తు చేశారు. 

టీటీడీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ మన్నవ  మోహనకృష్ణ మాట్లాడుతూ  ఎన్టీఆర్‌ అంతటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం తెలుగువారి అదృష్టమన్నారు. నటుడిగా, సంక్షేమ పథకాల ప్రదాతగా దేశం మొత్తానికి ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదంతో చంద్రబాబు తెలుగు జాతి అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడ్డారో అందరికి తెలుసన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్వార్థపూరిత రాజకీయ కుట్రలతో వ్యవస్థలు ఏరకంగా గాడితప్పతున్నాయో చూస్తున్మామని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం అప్రమత్తమై రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  అనంతరం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ టాంపా కార్యవర్గాన్ని ప్రకటించి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.  ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీశ్‌, నాట్స్‌ మాజీ చైర్మన్‌ గుత్తికొండ శ్రీనివాస్‌, మిర్చియార్డ్‌ మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News