
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ను ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా తాలూకు కీలక షెడ్యూల్ మంగళూరులో మొదలైంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది. ఎన్టీఆర్నీల్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశ నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. దర్శకుడు ప్రశాంత్నీల్ తనదైన శైలిలో రోమాంచిత పోరాట ఘట్టాలు, గ్రాండియర్ మేకింగ్తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడని, సిల్వర్స్క్రీన్పై సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భువన్గౌడ, సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: కల్యాణ్రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, రచన-దర్శకత్వం: ప్రశాంత్నీల్.
