దియా రాజ్, ఇనయా సుల్తానా, రిహానా, వికాస్, వశిష్ట, రోహిత్ బొడ్డపాటి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రై డే. ఈశ్వర్బాబు ధూళిపూడి దర్శకుడు. కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మదర్స్ డే సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమ్మా అంటూ సాగే ఈ సినిమాలోని పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విడుదల చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు.

అమ్మ ప్రేమను చాటిచెప్పేలా హృద్యంగా ఈ పాటను చిత్రీకరించడం జరిగిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. మధుకిరణ్ రాసిన ఈ పాటను ప్రజ్వల్ క్రిష్ స్వరపరచగా స్నిగ్ద నయని ఆలపించారు. ఇంకా నిర్మాత ఈశ్వర్బాబు, హీరో రోహిత్, దియా రాజ్, రిహానా, కల్పిక, బాలనటుడు గుడ్డు, సింగర్ సిగ్ద, ఇనయ సుల్తానా, తదితరులు మాట్లాడారు.
