Namaste NRI

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

హిందీ చిత్రం పింటు కీ పప్పీ తెలుగులో కిస్‌ కిస్‌ కిస్సిక్‌ పేరుతో రిలీజ్‌ కానుంది. సుశాంత్‌, జాన్యాజోషి జంటగా నటించిన ఈ చిత్రానికి శివ్‌ హరే దర్శకత్వం వహించారు. విధి ఆచార్య నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఈ నెల 8న ట్రైలర్‌ విడుదలకానుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇదని, పింటు అనే యువకుడి ప్రేమ ప్రయాణంలో ఎదురైన సంఘటనలను హాస్య ప్రధానంగా ఆవిష్కరిస్తుందని దర్శకుడు తెలిపారు.  ఈ నెల 21న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదలకానుంది.  విజయ్‌రాజ్‌, మురళీశర్మ, సునీల్‌ పాల్‌, అలీ అస్గర్‌ తదితరులు చిత్ర తారాగణం.

Social Share Spread Message

Latest News