
ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని ప్రారంభించింది. కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సినిమాలో మమిత బైజు కథానాయికగా నటిస్తున్నది. న్యూఏజ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇదని, లవ్, కామెడీ ప్రధానంగా ఆకట్టుకుంటందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. శరత్కుమార్, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: కీర్తిశ్వరన్.
