అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 భారీ విజయం దిశగా దూసుకెళుతుండగా చిత్రబృందంలో ఆనందోత్సహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీఈవో చెర్రీ అగ్ర కథానాయకుడు చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనతో విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి పుష్ప 2 బృందాన్ని అభినందించి, చిత్ర విశేషాలని అడిగి తెలుసుకున్నారు.