రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏటర్నిటీ ఎంట్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యాక్రమాలతో ప్రారంభమైంది. జులై 6 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మణికాంత్ గెల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెల్లవారితే గురువారం చిత్రాన్ని తెరకెక్కించిన మణికాంత్ గెల్లినే దీనికి దర్శకుడు. మ్యారేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఒక కథ. పెళ్లి నేపథ్యంతో పాటు, పెళ్లైన జంట మధ్య అహం ప్రధానంగా సాగే కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది. ఈ మూవీకి కల్యాణి మాలిక్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనుంది చిత్ర యూనిట్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)