
రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సన్పిక్చర్స్ బ్యానర్పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అగ్ర నటులు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్తో రజనీకాంత్ జోడీ కడుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
