ఆరేళ్ల వయసున్న బాలిక తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో రికార్డు సాధించింది. గణితంలోని పై విలువలో ఎకాఎకి 1,560 దశాంశ స్థానాలను చకచకా చెప్పేసింది. భారత సంతతికి చెందిన ఆరేండ్ల ఇషానీ షణ్ముగం ఈ నెల 13న తమ ఇంట్లో కూర్చుని, సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల ముందు పది నిమిషాల పాటు ఏకధాటిగా ఈ అంకెలను చెప్పింది. వాటిని పరిశీలించిన ప్రతినిధులు ఆమె పేరిట రికార్డు నమోదు చేశారు. రెండేళ్ల వయసులోనే ఇషానీ జ్ఞాపశక్తి సామర్థ్యాన్ని తాము గుర్తించామని తల్లి వెన్నెల మున్ను స్వామి తెలిపారు. ఇది వరకు సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)