Namaste NRI

కాన్సాస్ నగరంలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

అమెరికాలోని కాన్సాస్‌ నగరంలో ఎన్నారై టీడీపీ కాన్సాస్‌ సిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక, మహానాడును ఘనంగా నిర్వహించారు. వెలకటూరి లక్ష్మీనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని శ్రీనివాస్‌ దామ, అమరావతి ఏపీ రాజధానిగా కొనసాగించాలని కేశవ్‌ మాగంటి తీర్మానించారు. వెంకట్‌ నల్లూరి, శిల్లా బండ్ల తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వేణు కొల్ల, సాయి మనీంద్ర, మధు ఉప్పగండ్ల టీడీపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి సుమారు 150 మంది కొత్త సభ్యులను ఎన్నారై టీడీపీలో చేర్పించారు.

                 కార్యక్రమం విజయవంతమవ్వడానికి కృషి చేసిన దాతలు మనోహర్‌ నాయుడు వెలకుర్తి, ప్రకాశ్‌ కన్యధార, బాపురెడ్డి మోతె,  శివ  జాస్తిలకు నిర్వహకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ వేడుకల్లో జోహర్‌ అన్న ఎన్టీఆర్‌, జై బాబు.. బైబై బాబు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రావు ద్రోణవల్లి,  అరుణ్‌ కొమ్మినేని, వెంకట్‌ నెల్లూరి, ప్రకాశ్‌ కన్యధార, రతన్‌ కొమ్రనేని, మురళీ నర్ల, నాయుడు ఒట్టిగుంట, గౌతమ్‌ నల్లూరి, శ్రీనివాస్‌ కోడె, సురేశ్‌ తుమ్మల, హరి బండ్ల, గోపీ మండ్ల, శ్రీధర్‌ కొడాలి, వెంకట్‌ గొర్రెపాటి, సోమశేఖర్‌ పెమ్మసాని, సాయి నంబూరి, చంద్ర గన్నె తదితరులు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events