Namaste NRI

సంక్రాంతికి వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ : బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్  వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అఖండ్ణ తర్వాత అలాంటి మరో సినిమాని ప్రేక్షకులు ఆశిస్తారు. దానికి ధీటుగానే వచ్చిన వీరసింహా రెడ్డి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సంక్రాంతికి విందు భోజనం లాంటి సినిమా వీరసింహా రెడ్డి. తమన్ అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం అందించారు. రామ్ లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు అద్భుతంగా చేయడం జరిగిందిుఅని తెలియజేశారు.

దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ మొత్తం నైజాంలో 54 థియేటర్స్‌లో నాలుగు గంటలకు షో పడటం ఒక రికార్డ్.. రాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తే అరగంటలో టికెట్స్ అన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు హుషారుగా వచ్చి సినిమా చూశారు. ఇది మామూలు విషయం కాదు. నందమూరి బాలకృష్ణ నాకు ఇచ్చిన అవకాశాన్ని వందశాతం ఫుల్ ఫిల్ చేసుకున్నానని బలంగా నమ్ముతున్నాను. శ్రుతి హాసన్, వరలక్ష్మీ అద్భుతంగా నటించారు అని పేర్కొన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ వీరసింహారెడ్డి పెద్ద హిట్ అవుతుందని ఊహించాం. మేము ఊహించిన దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ ని సాధించింది. అన్ని చోట్ల రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ఫస్ట్ డే (ఇంకా సెకండ్ షోలు పడాలి) 50 కోట్ల గ్రాస్ దాటుతోంది. ఇది పెద్ద రికార్డ్. నైజం, సీడెడ్ , ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర ప్రతి చోట అద్భుతమైన కలెక్షన్స్ చేస్తోంది. యూఎస్ లో 708స గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది బాలకృష్ణ గారి ఆల్ టైం రికార్డ్. ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు, అభిమానులు బాలకృష్ణ గారి విశ్వరూపం చూశామని అభినందిస్తున్నారు. బాలకృష్ణ గారితో ఎప్పటి నుండో సినిమా చేయాలని అనుకుంటున్నాం. సినిమాతో ఆ కల నేలవేరింది. బాలకృష్ణ గారి కెరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని మాకు ఇచ్చినందుకు ఆనందంగా వుంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని గారికి థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. తమన్ అంచనాలు మించి మ్యూజిక్ ఇచ్చారు. వరలక్ష్మీ గారు ఎక్స్ ట్రార్డినరీ గా యాక్ట్ చేశారు. ఈ పండగ మరో నెల రోజుల వరకూ ఆగదు. వరల్డ్ మొత్తం షేక్ చేయబోతుంది. ప్రేక్షకుల అందరికీ కృతజ్ఞతలు  అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ. వీరసింహారెడ్డి ని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. భానుమతి పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ముఖ్యంగా బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు్ణ్ణ తెలిపారు. ఈ వేడుకలో నవీన్ యెర్నేని,వై రవిశంకర్, తమన్, వరలక్ష్మీ శరత్ కుమార్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News