బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో పాఠశాల 12వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవం) ఘనంగా ముగిశాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు కలిసి మొత్తం 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగిన ఈ సంబరాలు ఆకట్టుకున్నాయి.


6 గంటలపాటు జరిగిన ఈ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా పాటలు, పద్యాలు, స్కిట్లు, వక్తల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఆడిటోరియాన్ని రంగురంగుల బ్యానర్లు, పూలు, ఇతర కళాకృతులతో అందంగా అలంకరించడంతో అక్కడ పండుగ వాతావరణం ఉట్టిపడింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు, కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు అందరూ అచ్చ తెలుగు వస్త్రధారణలో సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కుమన్నారు.

భాను మగులూరి (పాఠశాల ఛైర్మన్), ప్రసాద్ మంగిన (పాఠశాల కో ఛైర్మన్), వెంకట్ కోగంటి (తానా జాయింట్ సెక్రటరీ), వెంకట్ అడుసుమిల్లి (తానా ఆర్ఆర్ నార్తర్ కాలిఫోర్నియా), శివ కాడా (బాటా ప్రెసిడెంట్), డా. గీతా మాధవి (కర్రిక్యులమ్ అడ్వయిజర్)లు పాఠశాల వార్షిక దినోత్సవానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచి విజయవంతంగా నిర్వహించిన తానా, బాటా ఎగ్జిక్యూటివ్ టీమ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, పాఠశాల ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్ల కృషిని ప్రశంసించారు.


బే ఏరియాలో పాఠశాల కు ఆదరణ పెరుగుతోందని, బే ఏరియాలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నారైల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాల ద్వారా భావి తరాలకు తెలుగు భాష, సంస్కృతిని నేర్పడమే పాఠశాల ముఖ్య ఉద్దేశ్యమని వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు వై. కాశీ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం కోసం విశేష కృషి చేసిన పాఠశాల బృందాన్ని ఆయన అభినందించారు. ఎన్నారైల పిల్లలు ఈ స్థాయిలో ప్రదర్శన చేయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు.

భక్త ప్రహ్లాద, నిధి వేట (నాటిక), అష్టావధానం, పుష్ప విలాపం పద్యాలు, శ్లోకాలు, గేయాలు, పద్యాలు అలరించాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రశ్నలు, సందేహాలను పాఠశాల కో ఆర్డినేటర్లు నివృత్తి చేశారు. చాలామంది విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు, వారిని చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపారు.

ఈ కార్యక్రమం మొత్తానికి గ్రాడ్యుయేషన్ వాక్ హైలైట్ గా నిలిచింది. ప్రతి సెంటర్ నుంచి విద్యార్థులు, టీచర్లు వేదికపైకి వచ్చి వారి సర్టిఫికెట్స్ అందుకున్నారు. గ్రాడ్యుయేషన్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్లో ప్లే అవుతుండగా వారు సర్టిఫికెట్లు అందుకున్న దృశ్యాన్ని చూసి అతిథులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషా వికాస పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. పాఠశాల చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చి విజయవంతం చేసిన బాటా బృందాన్ని బాటా అధ్యక్షుడు శివ కాడా అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

వరుణ్ ముక్క (వైస్ ప్రెసిడెంట్), హరి సన్నిధి(సెక్రటరీ), సందీప్ కేదారిశెట్టి, సంకేత్ కసుపలతో కూడిన లతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి, కొండల్ కొమరగిరిలతో కూడిన “స్టీరింగ్ కమిటీ”ని, కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన “సాంస్కృతిక కమిటీ”ని, సురేష్ శివపురం, రవి పోచిరాజు, హరీష్ ఐనంపూడి, సుధాకర్ బైరిలతో కూడిన నామినేషన్ కమిటీని, ఉదయ్, గౌతమి, సింధులతో కూడిన యూత్ కమిటీని శివ కాడా పరిచయం చేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందానికి, వినోదభరితమైన సాయంత్రాన్ని అందించిన బృందానికి బాటా సలహా బోర్డు సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి అభినందనలు తెలిపారు. బే ఏరియా పాఠశాల కో ఆర్డినేటర్లు: శ్రీదేవి ఎర్నేని, సురేష్ శివపురం, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, సునీత రాయపనేని, రవి పోచిరాజు, టీచర్లు: శరత్ పోలవరపు, విజయ గోపరాజు, పద్మ సొంఠి, ధనలక్ష్మి రంగు, శ్రీవిద్య యలమంచిలి, షీలా గోగినేని, శ్రీకాంత్ దాశరధి, పద్మ విశ్వనాథ్, దీప్తి మండలి, రాగిని అరసాడ, శ్యామ్ బాలె, శ్రీనివాస్ కొల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తానా టీమ్ మెంబర్ విజయ్ గుమ్మడి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ బిర్యానీ జంక్షన్, భీమవరం రుచులు రెస్టారెంట్ల వారు పసందైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.
