Namaste NRI

నిజాయితీగా పనిచేస్తే విజయం తథ్యం : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్‌, కేతికశర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సింగిల్‌. కార్తీక్‌రాజు దర్శకుడు.  నిర్మాత అల్లు అరవింద్‌.  విద్యా కొప్పినీడి, భానుప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మాతలు. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.  అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఈ సినిమా రషెస్‌ చూసిన తర్వాత శ్రీవిష్ణుని పిలిచి గీతా ఆర్ట్స్‌లో మరో రెండు సినిమాలు చేయాలని చెక్‌ ఇచ్చాను. నటుడిగా, వ్యక్తిగతంగా అంత బాగా నచ్చాడు. సినిమా బాగుంటే థియేటర్‌కు వస్తామని నిరూపించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. మండు వేసవిలో నవ్వుల జల్లులా ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారని అల్లు అరవింద్‌ ఆనందం వెలిబుచ్చారు.

 ఈ కథను 15 మంది రిజెక్ట్‌ చేశారని, వారందరికీ థాంక్యూ (నవ్వుతూ) చెబుతున్నానని, నిజాయితీగా పనిచేస్తే విజయం తథ్యమనే విషయాన్ని ఈ సినిమా నిరూపించిందని శ్రీవిష్ణు అన్నారు. ఈ సినిమా కోసం శ్రీవిష్ణుతో చేసిన జర్నీని మరచిపోలేనని, ఆయనతో మరిన్ని సినిమాల్లో పనిచేయాలనుందని వెన్నెల కిషోర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి, కిషోర్‌ తిరుమల, వివేక్‌ ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News