Namaste NRI

డల్లాస్‌లో విజయవంతంగా టీపాడ్‌ రక్తదాన శిబిరం

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డల్లాస్‌ (టీపాడ్‌) పలు స్వచ్ఛందంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఐటీ స్పిన్ కేంద్రంగా పద్నాలుగవ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో అల్లెన్, ఎంసీ కిన్నే, ప్రాస్పర్‌, ప్లేనో, ఇర్వింగ్‌, కొప్పెల్‌ ప్రాంతాల నుంచి రక్తదాతలు తరలివచ్చారు.

టీపాడ్‌ గడిచిన మూడేళ్లుగా ఏడాదికి రెండుసార్లు రక్తదానం నిర్వహిస్తూ ఇప్పటిదాకా 1,614 మంది ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే 540 పింట్ల రక్తాన్ని సేకరించింది. తాజాగా 38 పింట్ల రక్తాన్ని దాతల నుంచి సేకరించి స్థానిక బ్లడ్‌బ్యాంక్‌ కార్టర్‌ బ్లడ్‌కేర్‌కు అందజేసింది. టీపాడ్‌ అందిస్తున్న సేవలను కార్టర్‌ బ్లడ్‌కేర్‌ డీఎఫ్‌డబ్ల్యూ మెట్రో ప్రాంత కమ్యూనిటీ చాంపియన్ గా అభివర్ణించింది.

రత్న ఉప్పల  సమన్వయంతో ఎఫ్‌సీ చెయిర్‌ జానకీరామ్‌ మందాడి, ప్రెసిడెంట్‌ రూప కన్నయ్య , బీవోటీ చెయిర్‌ బుచ్చిరెడ్డి గోలి , కోర్డినేటర్‌ రవికాంత మామిడి నేతృత్వంలో రక్తదాన శిబిరం జరిగింది. ఏటా రక్తదాతలు సహకరించడం వల్లే తాము కమ్యూనిటీ చాంపియన్లుగా నిలుస్తున్నామని టీపాడ్‌ ప్రతినిధులు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events