బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ యాభై రోజులు పూర్తి చేసుకుంది. 103 కేంద్రాల్లో 50 రోజులుగా ప్రదర్శితమవుతూ పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది చిత్రం. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య యాభై రోజుల వేడుకని నిర్వహించింది. ఈ సందర్భగా బాలకృష్ణ మాట్లాడుతూ ఇది ప్రేక్షకుల ఇచ్చిన విజయమని అన్నారు. ఈ చిత్రం నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రసారం కానుంది అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, శిరీష్, స్టంట్ శివ, టి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.