Namaste NRI

టీ20 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్ లో ఒమన్ ఘన విజయం

టీ20 వరల్డ్‌ కప్‌ 2021 టోర్నీలో ఆరంభ మ్యాచ్‌లో ఒమన్‌ విజయం సాధించింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పపువా న్యూగినియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేసింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకముందే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఆ జట్టును ఛార్లెస్‌ (37)తో కలిసి కెప్టెన్‌ అసద్‌ 56, 43 బంతుల్లో 4/4, 3/6) ఆదుకున్నాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 81 పరుగులు జత చేయడంతో జట్టు కోలుకున్నట్లే కనిపించింది. కానీ తిరిగి పుంజుకున్న ప్రత్యర్థి బౌలర్లు ఆ తర్వాత 16  పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి జట్టును కట్టడి చేశారు. ఒమన్‌ కెప్టెన్‌ జీషన్‌ (4/20) బంతితో చెలరేగాడు. అనంతరం ఛేదనలో భారత సంతతి కుర్రాడు జతిందర్‌ (73 నాటౌట్‌, 42 బంతుల్లో 7/4, 4/6)తో పాటు మరో ఓపెనర్‌ అకీబ్‌ (50 నాటౌట్‌, 43 బంతుల్లో 5/4,1/6) కూడా అజేయ అర్థశతకాలతో సత్తా చాటడంతో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే ఒమన్‌ 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events