
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ ఈ సినిమాను నిర్మించనుండగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్లో ముఖ్య పాత్రలో టబు నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టబు ఇందులో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
