తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి లాక్డౌన్ మాత్రమే సరైన మార్గమని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి లాక్ డౌన్ ఉంటుంది అని ప్రకటించింది ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కాలేజీలు కూడా పూర్తిగా మూసి వేయాలని ఆదేశించింది స్టాలిన్ ప్రభుత్వం. థియేటర్లలో 50 శాతం అక్యుపెన్సీతో మాత్రమే నడపాలని ప్రభుత్వం సూచనలు చేసింది. మరిన్ని ఆంక్షలు విధించడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.