Namaste NRI

మెల్‌బోర్న్ లో అంగరంగ వైభవంగా టీడీపీ సంబరాలు

 ఆస్ట్రేలియా మెల్‌బోర్న్  లో టీడీపీ గెలుపు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నా రై టీడీపీ తరఫున ప్రకటించిన లక్ష ఉద్యోగ అవకాశాలను అమలుపరచాలని కోరారు. వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కోట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. తెలుదేశం మెల్‌బోర్న్ కమిటీ ఆధ్వర్యంలో న భూతో న భవిష్యత్ అనేలా సభను నిర్వహించారు. మెల్‌బోర్న్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 1100 మంది టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు విజయోత్సవ సంబరాలకు హాజరై సభను జయప్రదం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events