Namaste NRI

ఆస్ట్రేలియా స్థానిక సంస్థల ఎన్నికల్లో.. తెలుగువారు విజయం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటాడు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంధ్యారెడ్డి అలియాస్‌ సాండీ రెడ్డి, వెస్ట్‌ సిడ్నీలోని స్ట్రౌత్‌ ఫీల్డ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్‌ స్టన్‌ బ్లాక్‌ టౌన్‌ వార్డ్‌ 5 నుంచి విజయం సాధించారు.  కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్‌ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్‌ తరపున ఎన్నికయ్యారు. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

                        సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్‌ ఫీల్డ్‌లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్‌ ఆప్‌ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్‌ రెడ్డి, నిఖిల్‌ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్‌ విద్యాభాస్యంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్‌ రెడ్డి జూనియర్‌ చాంఫియన్‌గా నిలిచాడు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీనీ హాన్స్‌ బీ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. లివింగ్‌స్టన్‌, శ్రీనివాస్‌ ఇద్దరూ లిబరల్‌ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. ఈ మేరకు ఫలితాలు వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events