పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటబడిన ఓ రహస్య పత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్ పట్ల పాకిస్థాన్కు లోలోపల ఉన్న భయాలను ఆ పత్రం వెల్లడించింది. 1993లో భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను పరిశీలించి ఎన్ఐఈ (నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్) ఈ పత్రాన్ని రూపొందించింది. పైకి పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ భారత్ అంటే ఎంతో భయమని ఆ పత్రం స్పష్టం చేసింది.

భారత్-పాక్ మధ్య యుద్ధం మొదలైతే అది కశ్మీర్ కారణంగానే జరుగుతుందని అంచనా వేసింది. ఒకవేళ యుద్ధం వచ్చినా భారత్కు పాక్ భయపడుతుందని తెలిపింది. ఆర్థికంగా, సైనికపరంగా పాకిస్థాన్ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నది. భారత్లో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రవాదులతో అనధికారిక పొత్తులు పెట్టుకోవడం లాంటి తప్పుడు పనులు చేయొచ్చని ఎన్ఈఐ పేర్కొన్నది.
